ఫ్లాష్ ఫ్లాష్ నీటి ప్రవాహంలో భార్యాభర్త గల్లంతు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీలో
కిష్టారం పోతిరెడ్డి చరువు అలుగు నీటిలో దాటుతు నీటి ఉదృుతికి తానెం బాలయ్య తానెం రాములమ్మ ఇరువురు భార్య భర్తలు కొట్టుకు పోయారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎప్పుడు అడుగుపారని కాలువలు చెరువులు కూడా అలుగు పారుతున్నాయి.
కిష్టారం గ్రామపంచాయతీ పరిధిలో మూడు సంవత్సరాల తర్వాత ఆలుగు పారుతున్న అలుగు వరద దాటికి భార్యాభర్తలు ఇద్దరు పలుకు దాటుతూ గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన దంపతులను వెతుకుతున్నారు.
దంపతులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి జరిగిందని విషయం తెలియాల్సి ఉంది వారికి కుమారులు కూతుర్లు లేదా కుటుంబ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
ఈ సందర్భంగా జడ్చర్ల మండల తాసిల్దార్ ప్రజలకు విజ్ఞప్తి తెలియజేశారు వాగులు, వంకలు చెరువులు దాటేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని దాటాలని విజ్ఞప్తి చేశారు. గల్లంతయిన వృద్ధ దంపతులను గురించి విషయం తెలుసుకున్న మాజీ మత్రి లక్ష్మారెడ్డి వారి ఆచూకీ కనుక్కోవాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తూ ప్రభుత్వ అధికారులను గల్లంతైన వారి ఆచూకీ కనుక్కోవడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తె
లిపారు.
