KTR : మందా జగన్నాథం పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు

KTR: మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియ‌ర్ రాజకీయవేత్తను కోల్పోయిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.

హైదరాబాద్: పాలమూరు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ మందా జగన్నాథం తనదైన ముద్ర వేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అనారోగ్యంతో మృతిచెందిన మంద జగన్నాథం పార్థివ దేహాన్ని కేటీఆర్, ఇతర నాయకులు. సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియ‌ర్ రాజకీయవేత్తను కోల్పోయిందని తెలిపారు. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. వివాదరహితుడు సౌమ్యుడు..తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి అని చెప్పారు.మహబూబ్‌నగర్ అభివృద్ధిని మందా జగన్నాథం ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు.

Previous Post Next Post

Online

  1. RRB ALP CBT 2 Schedule : ఆర్ఆర్బీ లోకో పైలట్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే? - New!
  2. TG Courts Recruitment 2025 : తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు - రాత పరీక్ష తేదీలు ఖరారు, ఈనెల 8న హాల్ టికెట్లు విడుదల - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

Murugan Tamil Lyrics

  1. 01. கற்பனை என்றாலும் கற்சிலை என்றாலும் - Karpanai Endrallum Song Lyrics - New!

نموذج الاتصال

Follow Me