Telangana: నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్ను సేకరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: నగరంలోని గచ్చిబౌలిలో (Gachibowli) ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని గచ్చిబౌలిలోని రెడ్స్టోన్ హోటల్లో ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు
హోటల్లో సీసీ టీవీ ఫుటేజ్, విద్యార్థిని మొబైల్, వాట్సప్ మెసేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థినికి ఇంటర్నెల్గా ఏమైనా గాయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ప్రాథమిక విచారణలో విద్యార్థినిది ఆత్మహత్యే అనే పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశాలు
నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్ను సేకరించారు. విద్యార్థిని మృతిపై అనేక
విద్యార్థిని తండ్రి మాటల్లో...
‘‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రావాలని.. మాకు నిన్న రాత్రి కాల్ వచ్చింది. మేము హుటాహుటిన ఇక్కడకు వచ్చేసరికి మృతదేహాన్ని అంబులెన్స్లో పెట్టారు. రూంలో ఏం జరిగిందో మాకు తెలియదు. హత్య చేశారా.. లేక ఇంకా ఏదైనా అనేదా మాకు తెలియదు. మేము వచ్చేసరికి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. ఉరి వేసుకుందని చెబుతున్నారు. కూతురి ఒంటిపై గాయాలు ఉన్నాయి. తెలిసిన వాళ్లతోనే మా అమ్మాయి ఉంది. అంతా కలిసే భోజనం చేశారు. ఆ తరువాత మా కూతురిని వాళ్లు ఏం చేశారో తెలియదు. మాకు ఉరి వేసుకుందని ఫోన్లో చెప్పారు. మా కూతురును హత్య చేశారు. మాకు న్యాయం కావాలి’’ అంటూ విద్యార్థిని తండ్రి డిమాండ్ చేశారు.అనుమానాలు
నా కూతురు పిరికిది కాదు.. తల్లి ఆవేదన
‘‘శనివారం మాతో మాట్లాడింది. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఒకరికి ధైర్యం చెబుతుందే కానీ అలా చేసి ఉండదు. నా బిడ్డను ఏదో చేసి చంపారు. జాబ్ గురించి ఎప్పుడూ బాధపడలేదు. రూం ఖాళీ చేస్తాను అని చెప్పింది. శనివారం మాట్లాడింది.. ఆదివారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా బిడ్డ ఒంటిపైన గాయాలు ఉన్నాయి. అమ్మాయి స్నేహితులే ఏదో చేశారు’’ అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేశారువెల్లువెత్తుతుండటంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు..ఉన్నాయి.
రెడ్స్టోన్ హోటల్లో యువతి మృతదేహం లభ్యం
పోలీసులకు సమాచారం ఇచ్చిన హోటల్ సిబ్బంది
జడ్చర్లకు చెందిన యువతిగా గుర్తింపు
ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్నర్స్గా చేసిన యువతి
స్నేహితులు మోనా, జీవన్తో కలిసి..
హోటల్కు వెళ్లిందంటున్న యువతి బంధువులు
రేప్ చేసి ఉరి వేసి చంపారని కుటుంబసభ్యుల ఆరోపణ
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
హోటల్ రూమ్లో రక్తపు మరకలు, భారీగా మద్యం బాటిళ్లు
ఉస్మానియా ఆస్పత్రికి యువతి మృతదేహం తరలింపు
Red stone hotel Gachibowli
ఇద్దరు అనుమానిత యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చంపేశారని ఫ్యామిలీ ఆరోపణ!
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింగ్ విద్యార్ధి ఆత్మహత్య...?
జడ్చర్లకు చేందిన శృతి (23) హోటల్ ఫ్యాన్ లో కు ఉరివేసుకుని ఆత్మహత్య..
గతంలో యశోద హాస్పిటల్ లో నర్సుగా పనిచేసి శృతి..
గతంలో యశోద హాస్పిటల్ పని చేసిన శృతి..
గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లోని ఓ హోటల్లో ఫ్యానుకు వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది..
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు..
ఫ్లాష్..ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ : జడ్చర్ల పట్టణం కవేరమ్మ పేట లో అద్దెకుంటున్న ఓ యువతి హైద్రాబాద్ గచ్చిబౌలి లోని ఓ లాడ్జ్ లో అనుమానాస్పద మృతి. యువతిని రేప్ చేసి హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించినట్లు తల్లిదండ్రుల ఆరోపణ. తండ్రి వెంకటేష్ తల్లి సువర్ణ అమ్మాయి పేరు శృతి