ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ఆహ్వానించిన ఆలయ కమిటీ ప్రతినిధులు
జడ్చర్ల:
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ బంగ్లా సమీపంలో, 44వ జాతీయ రహదారి పక్కన వేంచేసియున్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం బోనాల పండుగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
బోనాల పండుగ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని ఆలయ కమిటీ ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా బోనాల పండుగ ఏర్పాట్లు, ఉత్సవ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకుంట లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వంశీ కృష్ణ చారి, చటమోని రమేష్ యాదవ్, బుర్ల వెంకటయ్య, దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్తో పాటు నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
