okapet land Auction in Hyderabad : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ-వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.151.25 కోట్లకు చేరింది. ఫ్లాట్ నంబర్ 15, 16లో మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. 15వ నంబర్ ప్లాట్లో ఎకరం రూ.151.25 కోట్లు, 16వ నంబర్ ప్లాట్లో ఎకరానికి రూ.147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు రూ.1353 కోట్ల ఆదాయం సమకూరనుంది.
15వ నంబర్ ప్లాట్లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారయణ కంపెనీ అనే సంస్థ దక్కించుకోగా, ప్లాట్ నెం 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ అనే కంపెనీ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండీఏ లేఅవుట్లో ఫ్లాట్ల భూముల వేలాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. గతవారం ఇదే లేఅవుట్లో రూ.137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసిందే.
వేలంలో ఉంచిన ప్లాట్ నంబర్ 15 అత్యంత అధిక ధర పలికింది. ఈ ప్లాట్లో ఉన్న ఎకరం భూమి రూ. 151.25 కోట్లకు కొనుగోలు జరిగింది. మొత్తం 4.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ అమ్మకం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 609.5 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ప్లాట్ను జీహెచ్ఆర్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.
అదేవిధంగా, ప్లాట్ నంబర్ 16 కూడా భారీ ధర పలికింది. ఇక్కడ ఎకరం ధర రూ. 147.75 కోట్లుగా నిర్ణయమైంది. 5.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 743 కోట్లు లభించాయి. ఈ ప్లాట్ను గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది.
ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎండీఏకు మొత్తం రూ. 1352 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం నగరం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కోకాపేట భూములకు ఉన్న డిమాండ్, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ విలువను మరోసారి చాటి చెప్పింది. భూముల వేలంలో కొత్త రికార్డు నమోదు కావడం రియల్టీ మార్కెట్కు శుభసూచకంగా భావించవచ్చు.