వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. నవంబరు 15 నుంచి



 

హైవే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 15, 2025 నుండి టోల్ ప్లాజాలలో కొత్త నిబంధన అమలు చేయనున్నారు. టోల్ ట్యాక్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పుడు, మీ వాహనంలో ఫాస్టాగ్ లేకపోయినా, అది పనిచేయకపోయినా, మీరు టోల్ ప్లాజాలో భారీ జరిమానా కట్టవలసి ఉంటుంది. అయితే, డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అంటే, ఆన్‌లైన్‌లో గాని, UPI ద్వారా టోల్ పన్ను చెల్లించే వారు నగదు రూపంలో చెల్లించే వారి కంటే తక్కువ రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2008 నాటి జాతీయ రహదారి రుసుము నిబంధనలను సవరించి కొత్త నిబంధనను అమలు చేసింది. ఈ నిబంధన ప్రకారం.. ఒక డ్రైవర్ చెల్లుబాటు అయ్యే FASTag లేకుండా టోల్ ప్లాజాలోకి ప్రవేశించి నగదుతో చెల్లిస్తే, వారి నుండి టోల్ రుసుము రెట్టింపు వసూలు చేయనున్నారు. అయితే అదే డ్రైవర్ UPI లేదా డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించి చెల్లిస్తే వారు టోల్ రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే చెల్లించాలి. మీ వాహనం టోల్ రుసుము రూ.100 అనుకుందాం. మీ FASTag పనిచేస్తుంటే అది రూ.100 మాత్రమే అవుతుంది. మీ FASTag పనిచేయక, మీరు నగదుతో చెల్లిస్తే రూ.200 చెల్లించాలి. UPIతో చెల్లిస్తే మీరు రూ.125 చెల్లించాలి. దీని అర్థం డిజిటల్ చెల్లింపులకు ఇప్పుడు ప్రత్యక్ష ఉపశమనం లభిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సవరణ ఉద్దేశ్యం టోల్ వసూలు వ్యవస్థను పారదర్శకంగా మార్చడం, నగదు లావాదేవీలను తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం. టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను తగ్గించడమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన,సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ చెబుతోంది.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow