హైదరాబాద్-శ్రీశైలం హైవే 'ఎలివేటెడ్ కారిడార్'.. 30 అడుగుల ఎత్తులో నిర్మాణం, త్వరగా శ్రీశైలం చేరుకోవచ్చు..! తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ వాహనదారులకు అందుబాటులోకి రానుంది. 62.5 కి.మీ మేర హైవే విస్తరణ చేపట్టనుండగా.. కృష్ణా నదిపై నాలుగు వరుసలతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే శ్రీశైలానికి దూరాభారం తగ్గనుంది.

 

తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లేవారితో పాటుగా.. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు ఈ హైవే పైనే వెళ్తుంటారు. ప్రతి నిత్యం ఈ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారిలో.. నల్లమల ఫారెస్ట్ అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లనుంది. ఇందులో 62 కిలోమీటర్ల దూరం రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవతున్నాయి.

ప్రాంతంలో టర్నింగ్‌ల కారణంగా.. వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ బారిన పడుతున్నాయి. దానికి తోడు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టారు. ఈ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెుత్తం 62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కుంచోనిమూల, దుర్వాసుల చెరువు ఫరహాబాద్‌, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం వరకు కారిడార్‌ వెళ్తుంది.

ప్రస్తుతం శ్రీశైలం వెళ్లే రోడ్డుమార్గంలో ఈగలపెంట మీదుగా పాతాలగంగ దాటాక కృష్ణా నదిపై ఓ బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఆ వంతెన దాటితే ఏపీ రాష్ట్ర పరిధి ప్రారభం అవుతంది. కృష్ణా నది దాటి ఏపీలో ప్రవేశించాక మళ్లీ ఘాట్‌ రోడ్డు మలుపులు తిరుగుతూ కొండపైకి చేరుకుంటుంది. ఈ మార్గంలో అధిక దూరం, సమయం, ప్రమాదకరంగా ప్రయాణం ఉంటుంది. దీంతో కృష్ణా నదిపై కొత్తగా ఐకానిక్‌ వంతెన నిర్మాణాన్ని కేంద్రం సిద్ధమవుతోంది.


ప్రస్తుతం హైదరాబాద్‌-శ్రీశైలం-నంద్యాల హైవే నల్లమల అడవి మీదుగా సాగుంది. ఈ మార్గంలో కృష్ణా నది, ఘాట్‌రోడ్లు. అద్భుతమైన శ్రీశైలం డ్యాం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం, ఆక్టోపస్, ఫర్హాబాద్‌ వ్యూపాయింట్లు, టైగర్‌ సఫారీ, సలేశ్వరం, ఉమామహేశ్వర టెంపుల్స్ టూరిస్టుల మనసు దోచేస్తాయి. ఈ జాబితాలో కొత్తగా ఐకానిక్‌ వంతెన కూడా చేరిపోనుంది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me