ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 33 బైక్లు, 1 కార్, 1 ఆటోలను గుర్తించి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాములు
మాట్లాడుతూ, జన సమాజంలో భద్రతను పెంపొందించడం, ప్రజలకు చేరువయ్యే దిశగా మరియు నేరాల నివారణకు ఈ తరహా తనిఖీలు ఎంతో అవసరమని, ప్రజలు సహకరించాలని సూచించారు. అలాగే, న్యాయసరైన పత్రాలు మరియు రవాణా నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ప్రజలలో భద్రతాభావాన్ని పెంపొందించడమే కాకుండా, నేర ప్రవృత్తులను అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో DCRB DSP రమణా రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎజాజ్ అహ్మద్, జడ్చర్ల ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి, RI MTO కృష్ణయ్య, మహబూబ్ నగర్ రూరల్ సీఐ గాంధీ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.