Telangana: తెలంగాణలో కులగణనను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
Ponnam: ఆ వివరాలు అవసరం లేదు.. కుల గణనపై మంత్రి పొన్నం సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 6: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కోరారు. బుధవారం ఉదదయం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని.. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారన్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.