*వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – లింగంపేట గ్రామము దగ్గర దుందుబి వాగు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్.*
*జడ్చర్లలో ట్రాఫిక్ జామ్ నివారణకు పోలీసులకు సూచనలు*
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లింగంపేట గ్రామం వద్ద దుందుభి వాగు వద్ద పరిస్థితిని జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. ప్రజలు పొలాలకు వెళ్లే సమయంలో, అవసరాల నిమిత్తం వాగులు దాటే సందర్భాలలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
“నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవసరం లేకపోతే వాగులు దాటి వెళ్లకూడదు. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అధికార యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది,” అని ఎస్పీ పేర్కొన్నారు.
అంతరం జడ్చర్ల టౌన్ నందు నేషనల్ హైవే 167 పనులు నడుస్తున్న నేపథ్యంలో, సిగ్నల్ గడ్డ దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించిన ఎస్పీ , అక్కడ అనునిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ను సరైన మార్గాలపై దారిమళ్లించేలా చర్యలు తీసుకోవాలని జడ్చర్ల టౌన్ పోలీసు అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
.