*ట్యాంకర్ ఢీకొని తండ్రి, కూతుళ్ళ దుర్మరణం*
*ట్యాంకర్ ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి*
*నన్ను కాపాడండి అంటూ బిటెక్ విద్యార్థిని మైత్రి వేడుకోలు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్ నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ ఇస్తున్న ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మచ్చేందర్ అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.. KP