పోలేపల్లి లోకాయుక్త హల్ చల్..
అధికారులపై లోకాయుక్త సీరియస్ అందరికీ తాఖీదులు ఇస్తాం
విద్యుత్ మరియు నీటి దొంగలు.....?
ఉచిత విద్యుత్ దొంగల మరియు నీటి దొంగల పై
చర్యలు ఉంటాయా..?
అధికారులపై మండిపడ్డ లోకాయుక్త
భూగర్భ జలాల అక్రమ రవాణాకు అధికారుల అవినీతి కారణం లోకాయుక్త.
jclnews:- భూగర్భం నుంచి తవ్వితోడుతున్నరు పోలేపల్లిలో ఇష్టంవచ్చినట్లు నీళ్లదందా లోకాయుక్త సభ్యుడి పరిశీలనలో విస్తుపోయే నిజాలు కళ్లుమూసుకున్న అధికారయంత్రాంగం మిషనభగీరథనుంచి నీటిని కేటాయించిన తీసుకోని కంపెనీలు పోలేపల్లిలో అసలేం జరుగుతుంది
తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా పోలేపల్లి గ్రామంలో భూమాత గర్భం నుంచి నీటిని ఇష్టం వచ్చినట్లు తోడి కంపెనీలకు అమ్ముకుంటున్న పట్టించుకునేవారు కరువయ్యారు. గదేంది జిల్లాలో కలెక్టర్ నుంచి గ్రామపంచాయతీలో కార్యదర్శి వరకు అధికారులు ఉన్నరు కదా వాళ్లంతా ఏం చేస్తున్నరు అనే కదా మీ సందేహం. అవును వాళ్ల కళ్లకు గంతలు కట్టేసిండ్రేమో మరి. మంగళవారం లోకాయుక్త పోలీసభ్యుడు గ్రామంలో నీళ్లదందాపై విచారణ చేసిండ్రు. ఆయన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూసినయ్.
jclnews:- గదేంది అంటర పోలేపల్లిలో నీళ్లదంద ఈరోజుది కాదు. పదేళ్లుగా నడుస్తున్నదే. ఐదారేళ్లకిందట ఇట్లనే లోకాయుక్త నుంచి మాథ్యుఖషి, ఇన్స్పెక్టర్ శివప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రాంరెడ్డిల బృందం వచ్చి నీళ్ల దందపై విచారణ జరిపి కేటీఆర్ వాటర్ంట్ను అక్కడిసుంచి తీసేయాలని సూచనలు జారి చేసిండ్రు, మరి ఆ సూచనలు ఏమైనయ్ అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇక ఇపుడు వచ్చిన సభ్యుడు పోలేపల్లిలో గల్లి గల్లి తిరిగి నీళ్లవ్యాపారం చేస్తున్నోళ్ల గుట్టు రట్టుచేసిండ్రు. వ్యవసాయానికి ఉపయోగించే బోర్లను వేసి నీటిని శుద్దిచేసి వాటిని నేరుగా కంపెనీలకు పైపైన్ ద్వారా పంపిస్తున్నరు. అవును నిజమే ఇంకొందరు అయితే ట్యాంకర్ల కొద్ది నీటిని అమ్ముకుని సొమ్ముచేసుకున్నరు. రోజుకు వందల ట్యాంకర్లు పోలేపల్లి సెజ్ లోకి అమ్ముకుంటు వ్యాపారం చేస్తున్నరు. వారంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే గా పార్టిలోకి పోతరు. ఇందులో మాజి సర్పం…
jclnews:- ఏఈ నుంచి కలెక్టర్ వరకు అందరికి నోటీసులు ఇస్తనని చెప్పుకొచ్చిండ్రు. మిషన్భగీరథ ద్వారా కంపెనీలకు నీళ్లు ఇవ్వాలని పోయిన ప్రభుత్వం పైజైన్లు వేసిండ్రు. అయిన గా నీళ్లు తీసుకోకుండా అధికారులకు లంచాలు ఇస్తూ బయటి నీటినే కొనుక్కుంటున్నరంటే కంపెనోళ్ల గొప్పతనం చూడండి మరి.