వనపర్తి జిల్లాలో సంచలనం.. బీఆర్ఎస్ ఎంపీపీపై హత్యాయత్నం

 వనపర్తి జిల్లాలో సంచలన చోటుచేసుకుంది.



 బీఆర్ఎస్ ఎంపీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాసేపటి క్రితం పానగల్ ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీను, ఆది స్వామి కిరోసిన్ చల్లి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎంపీపీ అనుచరులు వారి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎంపీపీ ప్రాణ భయంతో సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ ఆ వ్యక్తులే తనపై రెండు సార్లు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అదేవిధంగా దళితబంధు తమకు రాకపోవడానికి ముఖ్య కారణం ఎంపీపీ శ్రీధర్రెడ్డేనని దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను శ్రీను, ఆది స్వామి వెల్లడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.


Previous Post Next Post

نموذج الاتصال