వనపర్తి జిల్లాలో సంచలనం.. బీఆర్ఎస్ ఎంపీపీపై హత్యాయత్నం

 వనపర్తి జిల్లాలో సంచలన చోటుచేసుకుంది.



 బీఆర్ఎస్ ఎంపీపీపై కాంగ్రెస్ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాసేపటి క్రితం పానగల్ ఎంపీపీ శ్రీధర్రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీను, ఆది స్వామి కిరోసిన్ చల్లి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎంపీపీ అనుచరులు వారి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎంపీపీ ప్రాణ భయంతో సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో తలదాచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలోనూ ఆ వ్యక్తులే తనపై రెండు సార్లు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అదేవిధంగా దళితబంధు తమకు రాకపోవడానికి ముఖ్య కారణం ఎంపీపీ శ్రీధర్రెడ్డేనని దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను శ్రీను, ఆది స్వామి వెల్లడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.


Previous Post Next Post

Education

  1. TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం - New!
  2. TGRJC CET Notification 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - 'టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌' ప్రకటన విడుదల - దరఖాస్తు తేదీలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

అమ్మవారు

  1. అమ్మవారి భజన పాటల లిరిక్స్ l Ammavaari Bhajana patala lirics in Telugu - New!

نموذج الاتصال

Follow Me