నేడు దిల్లీకి సీఎం రేవంత్రెడ్డి
ఏఐసీసీ పెద్దలతో భేటీ
సీఎం మంగళవారం ఉదయం దిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఈ పర్యటనలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి మంత్రి సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల గురించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
వీరిద్దరినీ తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని గట్టిగా పట్టుబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
📋 ముఖ్యాంశాలు:
- మంత్రివర్గ విస్తరణ, కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కొంత సమయం తీసుకున్నా.. సురేఖ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు
- రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ార్జి మీనాక్షి నటరాజన్తో కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం
- ఒకరిద్దరు మంత్రులు, నాయకులు..సురేఖపై చర్యలు లేకుండా చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో మాట్లాడినట్లు తెలిసింది
- అయితే ఆమె నుంచి ఎలాంటి హామీ రాలేదని సమాచారం
కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం రేవంత్రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే నిర్ణయంలో ఏమైనా మార్పు ఉండొచ్చేమో కానీ.. లేదంటే మాత్రం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రెండ్రోజుల దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.