జడ్చర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న దుకాణాల లీజు గడువు ముగియడంతో అధికారులు ప్రస్తుత దుకాణదారుడికి నోటీసులు జారీ చేశారు.
లీజు అగ్రిమెంట్ గడువు పూర్తైన నేపథ్యంలో దుకాణాన్ని ఖాళీ చేసి మండల పరిషత్కు అప్పగించాలని అధికారులు ఆదేశించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ దుకాణానికి తిరిగి బహిరంగ టెండర్ లేదా వేలం పాట నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నోటీసు అందిన 15 రోజుల్లోగా ఎలాంటి నష్టపరిహారం లేదా మినహాయింపులు కోరకుండా దుకాణాన్ని ఖాళీ చేసి మండల పరిషత్కు అప్పగించాలని సూచించారు.
అలాగే పాత అద్దె బకాయిలు ఏమైనా ఉంటే నిర్ణీత గడువులోగా చెల్లించి రసీదు పొందాలని అధికారులు సూచించారు.
పాత అద్దె బకాయిలు లేని ప్రస్తుత దుకాణదారుడు కూడా నిబంధనల ప్రకారం బహిరంగ టెండర్ లేదా వేలం పాటలో పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు జడ్చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోటీసులు జారీ చేశారు.
ఈ విషయంపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ మహబూబ్నగర్కు కూడా సమాచారం పంపించారు.