కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు కోసం తహసీల్దార్ కాళ్లు మొక్కిన ఆశావహుడు..


 డబుల్​ బెడ్​ రూం ఇండ్ల లిస్టులో నుంచి తన పేరు తొలగించారని  కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. మండల కేంద్రానికి చెందిన  మహమ్మద్ అహ్మద్   ఇల్లు కోసం అప్లయ్​ చేసుకున్నాడు.  ఫస్ట్​ లిస్టులో  పేరు వచ్చినప్పటికీ తర్వాత తొలగించారని ఆవేదన చెందాడు.  అదే సమయంతో తహసీల్దార్​ జానకీ  రాగా..  ఆమె కాల్లు మొక్కి తనకు ఇల్లు ఇవ్వాలని కోరారు. అనంతరం   సెల్​ టవర్​ ఎక్కి నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.  

పింఛన్​ కోసం చెట్టెక్కి ఆందోళన.. 

నాకు మూర్ఛవ్యాధి ఉంది. మూడేండ్ల కిందటిదాకా 4వేల పింఛన్​ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. పింఛన్​ ఇప్పిస్తరా.. లేక ఇదే చెట్టుమీద సావాల్న’ అని   కామారెడ్డి జిల్లాలో  భిక్కనూరు మండలం కంచర్లలో గురువారం గ్రామానికి చెందిన  గొల్ల రాములు ఆందోళన చేశాడు. మూర్చ వ్యాధితో బాధపడుతున్న రాములుకు  గతంలో పింఛన్​ వచ్చేది.  3 ఏండ్ల క్రితం అది ఆగిపోయింది. మళ్లీ అప్లయ్​ చేసుకున్నా ఫించన్​రావడంలేదు.

 దీంతో తన పింఛన్​ గురించి ఎవరికి విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామ సభ జరగుతుండగా.. గ్రామ సచివాలయం ఆవరణలోని  చెట్టుపైకి ఎక్కి .. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు.  తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని  వార్డు సభ్యులు నచ్చజెప్పినా వినకపోవడంతో  ఓ వార్డు మెంబర్ చెట్టుపైకి వెళ్ళి రాములుకు బుజ్జగించి కిందకు తీసుకువచ్చారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow