బైకు ఢీ కొని మహిళా ఉపాధ్యాయురాలుకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.
మహమ్మదాబాద్ : బైకు ఢీ కొని మహిళా ఉపాధ్యాయురాలుకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎంఈఓ రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండల పరిధిలోని షేక్పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డి. పల్లవి మంగళవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. రోజూ మాదిరిగానే పాఠశాల విధులకు వెళ్లేందుకు మహమ్మదాబాద్ కొత్త బస్టాండ్ సమీపంలో తోటి ఉపాధ్యాయుల వాహనం కోసం ఎదురుచూస్తుండగా.. అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టినట్లు సమాచారం. షేక్పల్లికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు సమూహంగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన పల్లవి ని సహచరులు మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఎంఈఓ రాజు నాయక్ తెలిపారు.
Tags
mahabubangar