సలసర్ బాలాజీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ప్రతి సంవత్సరం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్న పట్టించుకోని ప్రభుత్వం.
కార్మికుల భద్రత పట్టణ యజమాన్యం
ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా షార్ట్ అవుతుంది. ఈ ప్రమాదాలపై కంపెనీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈరోజు జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్మాదం జరిగి ఇద్దరు సజీవ దహనం కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జిల్లా అధికార యంత్రాంగం సలసర్ బాలాజీ కంపెనీలు ఏమి జరుగుతుందో సమగ్ర విచారణ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.
,: జిన్నింగ్ మిల్లు అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో చోటు చేసుకుంది మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే సమయంలో మిల్లులోని బయటికి గాలి ఈడ్చే పైపు లైన్ లో చెత్త ఇరుక్కుందని వాటిని తొలగించేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు 26, బీహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్ 23 వెళ్లారు. ఈ క్రమంలో అటుపక్క అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరికీ ఇటీవలే వివాహం అయిందని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనతో బీహార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు కంపెనీ యజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ వద్ద పోలీసులతో కంపెనీ యజమాన్యం పై దాడికి దిగారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను కంపెనీ వద్దకు రప్పించారు..
