కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటనలో ప్రధానోపాధ్యురాలిని సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
అటెండర్ యాకుబ్ బాలికలపై లైంగిక దాడి చేశాడనే విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టిన ప్రిన్సిపాల్ కమల.
ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు పెట్టిన అటెండర్ పై పోక్సో కేసు.. సస్పెన్షన్ వేటు.
పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను సైతం చిత్రీకరించి.. ఏఐతో విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన అటెండర్ యాకుబ్ భాషా
వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరుగురు బాలికలపై లైంగిక వేధింపులు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరా అమర్చిన అటెండర్ యాకుబ్
రెండేళ్లుగా వీడియోలు, ఫోటోలు తీస్తున్న యాకుబ్
వారం క్రితం బాత్రూములో ఓ పరికరాన్ని గమనించి తల్లిదండ్రులకు చెప్పిన కొందరు విద్యార్థినులు
అధికారుల విచారణ అనంతరం నిందితుడు యాకుబ్ పై పోక్సో కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
