నవరాత్రి సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తులు ఎంతో శ్రద్ధతో పూజిస్తారు. ఈ సమయంలో దుర్గాదేవికి ఎర్ర మందార పువ్వులను కూడా ఎక్కువగా సమర్పిస్తారు. అయితే, దుర్గాదేవికి ఈ పువ్వులు ఎందుకు సమర్పిస్తారు? ఈ పువ్వు ప్రాముఖ్యత ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎర్ర మందార పువ్వులను అర్పిస్తారు. ఎందుకంటే ఎరుపు రంగు ధైర్యం, బలం, శక్తిని సూచిస్తుంది. మందారాన్ని దుర్గాదేవికి ఇష్టమైన పువ్వుగా భావిస్తారు. ఇంకా, ఇది కోరికలను నెరవేరుస్తుందని, విజయం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.
మందార పువ్వులను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఎరుపు మందార పువ్వు దుర్గాదేవి ఉగ్ర శక్తిని సూచిస్తుంది. ఈ పువ్వును సమర్పించడం వల్ల అమ్మవారు తమకు శక్తిని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం.
దుర్గాదేవికి మందార పువ్వును సమర్పించడం ద్వారా, భక్తుల కోరికలు నెరవేరుతాయి. వారు జీవితంలో విజయం పొందుతారు.
మందార పువ్వును సమర్పించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, అదృష్టం పెరుగుతాయి.
ఈ పువ్వును సమర్పించడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.
మందార పువ్వు ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం, కాబట్టి దుర్గాదేవికి మందార పువ్వును సమర్పించడం ద్వారా, ఒక వ్యక్తి నిజమైన ప్రేమ, ఆనందాన్ని పొందుతాడు.