*పోలీస్ డ్యూటీ మీట్–2025 సెలెక్షన్ కార్యక్రమం జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ*
జూలై 2025లో వరంగల్ నందు నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ – 2025 లో పాల్గొనే జోగులాంబ జోన్-VII టీమ్ కోసం మహబూబ్నగర్ జిల్లా పోలీస్ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కవాతు మైదానము ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీసు అధికారి డి.జానకి, ఐపీఎస్ హాజరై, సెలెక్షన్లో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ "పోలీస్ డ్యూటీ మీట్ నందు 6 ఎవెంట్స్ వుంటాయి అవి
1) సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్వెస్టిగేషన్
2) విధ్వంస నిరోధక తనిఖీ (Anti Sabotage check)
3) డాగ్ స్క్వాడ్ పోటీ
4) కంప్యూటర్ అవగాహన
5) ఫోటోగ్రఫీ
6) వీడియోగ్రఫీ
డ్యూటి మీట్ అనేది ఒక వినూత్నమైన వేదిక. ఇది పోలీస్ వ్యవస్థలోని ప్రతిభావంతులైన అధికారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. విజయం సాధించడంలో శారీరక దారుఢ్యం కంటే మానసిక ధైర్యమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించి, క్రమశిక్షణతో, నిరంతరంగా సాధన చేస్తూ ముందుకు సాగాలి. స్టేట్ స్థాయి పోటీల్లో పాల్గొనబోయే మా జిల్లా టీమ్ గొప్ప ప్రతిభను ప్రదర్శించి, మహబూబ్నగర్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో గర్వించేటట్లు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను."
జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ సెలెక్షన్ ద్వారా ఎంపికైన పోలీస్ అధికారులు జూలై నెలలో వరంగల్ నందు జరిగే పోలీస్ డ్యూటీ మీట్లో జోనల్ టీమ్ తరఫున పోటీపడనున్నారు. జిల్లా స్థాయిలో అన్ని విభాగాల నుంచి ప్రతిభావంతులైన పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి సురేష్ కుమార్, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, డిటిసి డిఎస్పి గిరి బాబు, AR DSP శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, RI లు కృష్ణయ్య, నగేష్, రవి, రమేష్, IT కోర్ టీం ఇన్చార్జ్ రాఘవేందర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పా
ల్గొన్నారు.