మొత్తంగా 32 జిల్లాలలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాలలోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి ఖాతాలలో మొత్తం రూ. 569 కోట్లు జమ అయ్యాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా..
Telangana: రైతులకు బ్యాంకుల నుంచి మెసేజ్లు.. ఏంటని చూడగా పండుగో పండుగ
సీఎం రేవంత్ చేతుల మీదుగా జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ. 6000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడత విడుదల చేయడం జరిగిందన్నారు. విడుదల చేసిన నిధులు ఇవాళ జనవరి 27న రైతుల అకౌంట్లలో జమ చేయబడ్డాయని తెలిపారు.
జిల్లాల వారిగా విడుదలైన నిధుల వివరాలు..
ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలలోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు 14.49 కోట్లు
భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో 23 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు
హన్మకొండ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,545 రైతులకు 14.30 కోట్లు
జగిత్యాల జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 22,242 రైతులకు 39.07 కోట్లు
జనగామ జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు 15.91 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 7,073 రైతులకు 8.67 కోట్లు
జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 7,829 రైతులకు 12.47 కోట్లు
కామారెడ్డి జిల్లాలో 22 మండలాలోని 24 గ్రామాలకు చెందిన 9,062 రైతులకు 8.35 కోట్లు
కరీంనగర్ జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 14,226 రైతులకు 15.96 కోట్లు
ఖమ్మం జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు 28.42 కోట్లు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 4,344 రైతులకు 8.62 కోట్లు
మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలోని 19 గ్రామాలకు చెందిన 14,611 రైతులకు 18.14 కోట్లు
మహబూబ్ నగర్ జిల్లాలో 16 మండలాలోని 16 గ్రామాలకు చెందిన 14,575 రైతులకు 17.27 కోట్లు
మంచిర్యాల జిల్లాలో 16 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 7,143 రైతులకు 8.72 కోట్లు
మెదక్ జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు 14.06 కోట్లు
మేడ్చల్ జిల్లాలో 5 మండలాలోని 5 గ్రామాలకు చెందిన 2,706 రైతులకు 3.14 కోట్లు
ములుగు జిల్లాలో 9 మండలాలోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు 8.26 కోట్లు
నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 16,806 రైతులకు 23.05 కోట్లు
నల్లగొండ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు
నారాయణపేట జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు 13.87 కోట్లు
నిర్మల్ జిల్లాలో 18 మండలాలోని 18 గ్రామాలకు చెందిన 7,912 రైతులకు 10.56 కోట్లు
నిజామాబాద్ జిల్లాలో 31 మండలాలోని 31 గ్రామాలకు చెందిన 35,568 రైతులకు 46.93 కోట్లు
పెద్దపల్లి జిల్లాలో 13 మండలాలోని 13 గ్రామాలకు చెందిన 9,885 రైతులకు 10.14 కోట్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలోని 12 గ్రామాలకు చెందిన 9,724 రైతులకు 12.26 కోట్లు
రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలోని 21 గ్రామాలకు చెందిన 15,597 రైతులకు 20.32 కోట్లు
సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలోని 25 గ్రామాలకు చెందిన 19,933 రైతులకు 24.15 కోట్లు
సిద్దిపేట జిల్లాలో 26 మండలాలోని 26 గ్రామాలకు చెందిన 31,170 రైతులకు 36.76 కోట్లు
సూర్యాపేట జిల్లాలో 23 మండలాలోని 23 గ్రామాలకు చెందిన 29,352 రైతులకు 37.84 కోట్లు
వికారాబాద్ జిల్లాలో 20 మండలాలోని 20 గ్రామాలకు చెందిన 8,609 రైతులకు 11.18 కోట్లు
వనపర్తి జిల్లాలో 15 మండలాలోని 15 గ్రామాలకు చెందిన 9,441 రైతులకు 12.25 కోట్లు
వరంగల్ జిల్లాలో 11 మండలాలోని 11 గ్రామాలకు చెందిన 11,386 రైతులకు 12.86 కోట్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలోని 17 గ్రామాలకు చెందిన 17,576 రైతులకు 26.95 కోట్లు విడుదల అయ్యాయి.
మొత్తంగా 32 జిల్లాలలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాలలోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి ఖాతాలలో మొత్తం రూ. 569 కోట్లు జమ అయ్యాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా మొదలు పెట్టడం జరిగిందని, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసాని అందచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.