10 మంది ఐపీఎస్ల బదిలీఏఎస్పీలుగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు : IPS officer Transfers: రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని వేర్వేరు జిల్లాలకు ఏఎస్పీలుగా నియమించారు. వీరంతా 2021-22 బ్యాచ్కు చెందిన అధికారులు. కొత్త పోస్టింగులు పొందినవారు వెంటనే విధుల్లో చేరాలని, ఇప్పటికే పనిచేస్తున్నవారి నుంచి బాధ్యతలను స్వీకరించాలని సీఎస్ తెలిపారు. పాత అధికారుల్లో కొందరు హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాజల్ను గ్రేహౌండ్స్ ఏఎస్పీ నుంచి ఉట్నూరు ఏఎస్పీగా, కంకణాల రాహుల్ రెడ్డిని గ్రేహౌండ్స్ ఏఎస్పీ నుంచి భువనగిరి ఏఎస్పీగా, చిత్తరంజన్ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి ఆసిఫాబాద్ ఏఎస్పీగా, చైతన్య రెడ్డిని ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి కామారెడ్డి ఏఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. చేతన్ నితిన్ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి జనగామ ఏఎస్పీగా, విక్రాంత్ కుమార్ సింగ్ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేశారు. అక్కడి ఏఎస్పీ అంకిత్ కుమార్ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇక, శుభం ప్రకాశ్ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా, రాజేశ్ మీనాను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి నిర్మల్ ఏఎస్పీగా, మౌనికను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి దేవరకొండ ఏఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది
Tags
News@jcl