గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే చార్జీలు వసూలు చేస్తారు. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహజ్యోతి పథకంలో పేద కుటుంబాలు 200 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా పొందవచ్చు.
Gruha Jyoti Scheme:
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతాయి. వీటి ద్వారా పేదలు ఆర్థికాభ్యున్నతి సాధించడం, వారి కుటుంబ పరిస్థితి బాగుపడడం, తద్వారా సమాజం కూడా ప్రగతి పథంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడమే పథకాల ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజల కోసం గృహజ్యోతి అనే పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నారు. అర్హతలు..
తెలంగాణ గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింద తెలిపిన అర్హతలు ఉండాలి.
తెలంగాణ వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు అనర్హులు.
ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారులు ఎటువంటి బకాయిలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు ఉండకూడదు.
ఇది గృహావసరాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తుదారులు తమ తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసేవారికి ఎక్కువ ఇళ్లు ఉంటే.. వాటిలో దేనికైనా ఈ పథకాన్ని పొందవచ్చు.
దరఖాస్తు చేసే విధానం..
ప్రజాపాలన అధికారిక పోర్టల్ నుంచి గృహ జ్యోతి పథకం అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
దానిలో వివరాలను పూర్తి చేయాలి, అవసరమైన పత్రాలను జత చేయాలి.
దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలి.
జతచేయాల్సిన పత్రాలు..
ఆధార్ కార్డు
నివాస రుజువు
తెల్ల రేషన్ కార్డు *విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ
కరెంట్ కరెంటు బిల్లు
అద్దె, అద్దె పత్రాలు (వర్తిస్తే)
