Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!

Caption of Image.

ఏపీ ఎన్నికల నేపధ్యంలో మెగా(Mega), అల్లు(Allu) ఫ్యామిలీల మధ్య గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున కాకుండా తన స్నేహితుడి తరపున ప్రచారం చేశారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పు బట్టాయి. పవన్ కళ్యాణ్ కి కాకుండా వేరే పార్టీ వాళ్లకి ఎలా సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ నాగ బాబు చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పరాయివల్ల కోసం పనిచేసే మావాడైన పరాయివాడే.. మాకోసం మరిచేసే పరాయివాడైనా మావాడే.. అంటూ రాసుకొచ్చాడు నాగబాబు. 

నాగబాబు చేసిన ఈ ఒక్క పోస్ట్ తో మెగా, అల్లు కుటుంబాల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. సోషల్ మీడియాలో రెండు ఫ్యామిలీలపై ఓ రేంజ్ లో ట్రోల్స్ నడిచాయి. ఈ క్రమంలోనే తన ట్విట్టర్ అకౌంట్‌ను డియాక్టీవేట్ చేశాడు నాగబాబు. అక్కడితో ఈ గొడవ సద్దుమణింగింది అనుకున్నారు అంతా. తాజాగా.. మళ్ళీ ట్విట్టర్ లో రీఎంట్రీ ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు.. ఎంట్రీతోనే మరో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో..  నేను నా ట్వీట్‌ను డిలీట్ చేశాను.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఇక్కడితో అయినా ఈ వివాదం ఆగుతుంది లేదా అనేది చూడాలి మరి.

©️ VIL Media Pvt Ltd.


from V6 Velugu https://ift.tt/PYM42NA
via IFTTT
Previous Post Next Post

Education

  1. TG EAPCET Results 2025 : నేడు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల.... మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి - New!
  2. TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...? - New!

نموذج الاتصال