Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌‌ను జూన్3 వరకు పొడిగింపు

 Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌‌ను జూన్3 వరకు పొడిగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ ఈరోజు(సోమవారం)తో ముగిసింది. దీంతో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. అయితే కవితను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ, సీబీఐ అధికారులు హాజరుపరిచారు. సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ జూన్3 వరకు కోర్టు పొడిగించింది.

కాగా.. మార్చి 26 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోండటంతో కవితను ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచారు. కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నించారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Previous Post Next Post

نموذج الاتصال