NEWSW AT JCL SPL STORY మహబూబ్నగర్ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం..
హోరాహోరీ ప్రచారం రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పై చేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు, డిసెంబర్ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు..వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థి ఒక్కరి నలుగురు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రెండు సార్లు గెలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి బరిలో వున్నారు. అలాగే బీజేపీకి కొంత పట్టు ఉన్న పాలమూరులో కాషాయం జెండా ఎగరవేయాలని పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు
తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ తాను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు మహబూబ్నగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. ప్రచారంలో తనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని పెడుతున్న చెబుతున్నారు యెన్నం శ్రీనివాస్రెడ్డి పార్టీ మార్పు ప్రభావం బీజేపీపై ఉండదని.. లీడర్లు వెళ్లినా బీజేపీలో కార్యకర్తలంతా పార్టీవైపే ఉంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మహబూబ్నగర్లో అభివృద్ధి జరిగిందన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదని.. కాని పబ్లిసిటీ స్టంట్తో అంతా వారే చేశామని చెప్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తనదే విజయమంటూ మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, అలాగే అన్ని పథకాలు అందేలా కృషిచేస్తానని మిథున్రెడ్డి చెబుతున్నారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజలంతా బీఆర్ఎస్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారు మార్పు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని.. అందుకే తాను బీఆర్ఎస్ను ఓడించేందుకు బిజెపి పార్టీ మారానని చెబుతున్నారు ఓటమి భయంతోనే ఇరు పార్టీలు కలిసి తనపై అభాండాలు వేస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు తన జీవితం తెల్లని కాగితమని… తన ట్రాక్ రికార్డ్ ఎవరైనా పరిశీలించవచ్చని చెబుతున్నారు
తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్. ప్రచారం చేసుకుంటున్నాడు తాము చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్నామన్నారు. నియోజకవర్గాన్ని గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా నని నమ్మ పలుకుతున్నాడు. ప్రతిపక్ష నేతలు గెలుస్తామని గాలిలో మేడలు కడుతున్నారని.. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నచ్చ చెబుతున్నాడు మహబూబ్నగర్ అభివృద్ధికి తాను రోజుకు 18 గంటలు కష్టపడ్డానని. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని.. మహబూబ్నగర్లో తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్లకు డిపాజిట్లు కూడా రావని, తన విజయం ఖాయమని చెప్తు ధీమాగా ఉన్నాడు
మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న సామాజిక న్యాయం బీసీ నినాదంతో స్వతంత్ర అభ్యర్థి మెట్టు కార్డు శ్రీనివాస్ ముదిరాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు అందరి చూపు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మెట్టు కాడి శ్రీనివాస్ ముదిరాజ్ పై కేంద్రకతమై ఉంది 2004లో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ముదిరాజ్ బీసీ కుల సంఘాల నాయకత్వం వహించిన పరిచయాలతో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ తో గోప్యంగా ప్రచారం నిర్వహించుకుంటున్నాడు మహబూబ్నగర్ నియోజకవర్గం బీసీలకు పెద్దపీట వేస్తుందని గత 40 సంవత్సరాలుగా పులి వీరన్న రెండుసార్లు పొడపాటి చంద్రశేఖర్ నాలుగుసార్లు శ్రీనివాస్ గౌడ్ రెండుసార్లు బీసీలే ప్రాతినిధ్యం వహించారని ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు ఆయన మరణం తర్వాత ఏర్పడిన ఉప ఎన్నికల్లో ఎన్ ఎం శ్రీనివాసరెడ్డి గెలుపొందారు తప్ప ఎప్పుడు ఇక్కడ బీసీలే ప్రాతినిధ్యం వహించారని మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొంటున్నారు ఒక బీసీకి చెడ్డ పేరు వస్తే ఇంకొక బీసీకి ఓటేస్తారని ఆయన ధీమాగా ఉన్నారు చతుర్ముఖ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు గెలుపుతిమా వ్యక్తం చేస్తున్నారు
Tags
News@jcl

