మహబూబ్‌నగర్‌ ఎస్పీగా అందెరాములు నియమితులయ్యారు.

హైదరాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్
హైదరాబాద్:అక్టోబర్ 12 హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్‌ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, "రి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌, వరంగల్‌ సీపీగా డీ.మురళీధర్‌, నిజామాబాద్‌ సీపీగా ఎస్‌.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్‌, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్‌.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా అందెరాములు నియమితులయ్యారు. నాగర్‌ కర్నూల్‌ ఎస్పీగా సీహెచ్‌.రామేశ్వర్‌, గద్వాల ఎస్పీగా ఎన్‌ వి, మహబూబాబాద్‌ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు...
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me