లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల ముందు రేపు 6 ఫిబ్రవరి 2023 సోమవారం దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన.*
సామాన్యుల కష్టార్జిత పొదుపు ఖర్చులతో నిర్మితమైన LIC, SBI లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుండి తమ సన్నిహితులకు, కొద్దిమంది బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ దేశం, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఎల్ఐసి మరియు ఎస్బిఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశానికి గర్వకారణం.
తన గుజరాత్ మిత్రులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూప్లో ఎల్ఐసి, ఎస్బిఐ మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేసింది. LIC అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడులు పెట్టింది. గత కొన్ని రోజుల్లో 39 కోట్ల మంది పాలసీ హోల్డర్లు మరియు LIC పెట్టుబడిదారులు 33,060 కోట్లు నష్టపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరియు ఇతర ప్రభుత్వ బ్యాంకులు అదానీ గ్రూప్కు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చాయి. భారతీయ బ్యాంకులకు అదానీ గ్రూప్ సుమారు ₹80,000 కోట్లు బకాయిపడింది.
కోట్లాది మంది భారతీయుల కష్టార్జిత పొదుపును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న ఆదాని కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పోరాడుతుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తలపెట్టడం జరిగింది.
1. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేసి నిష్పాక్షిక దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి.
2. ఎల్ఐసి, ఎస్బిఐ మరియు ఇతర జాతీయ బ్యాంకుల బలవంతపు పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి, పెట్టుబడిదారుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
కావున
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇట్టి కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, INTUC నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగలరు.
*సమయం ఉదయం 10:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా LIC కార్యాలయం చేరుకొని నిరసన కార్యక్రమం నిర్వహించబడును.*
Tags
News@jcl.