రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ ను ఈ విధంగా డెకరేట్ చేయటంపై రైల్వే అధికారులు స్పందించారు. ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాబిన్ అనేది వ్యక్తిగతంగా.. ఏకాంతంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. హనీమూన్ గదిగా మార్చుకోవటానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. అలాంటి పర్మీషన్ ఏదీ నిబంధనల్లో లేదు. వాళ్ల క్యాబిన్ ను మరింత అందంగా డెకరేట్ చేసుకుంటే కాదని ఎలా చెప్పగలం అంటున్నారు రైల్వే అధికారులు. అయితే భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని.. క్యాండిల్స్ వెలిగించటం అనేది నేరంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుగా చెబుతున్నారు అధికారులు. జల్నా రైల్వేస్టేషన్ లో ఈ వీడియో తీయటం జరిగిందని చెబుతూనే.. ఆ జంట ఎక్కడి నుంచి  ఎక్కడికి వెళుతుంది అనేది మాత్రం వెల్లడించలేదు.