మండల పరిధిలోని డిండి–చింతపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా... ట్రాక్టర్ పట్టివేత
వంగూర్ మండల పరిధిలోని డిండి–చింతపల్లి గ్రామ శివారులో దుందుభి వాగు నుంచి గురువారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను బ్లూ కోర్ట్ సిబ్బంది పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
TG 31T 0014 నంబర్ గల ట్రాక్టర్ను చింతపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ నీరటి రమేష్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై మహేష్ గౌడ్ తెలిపారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వడం లేదా రవాణా చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Tags
mahabubangar