మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచించారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు సూచించారు. బుధవారం మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి ఆమె పరిశీలించారు. నామినేషన్లు దాఖలు చేయుటకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి లోటు పాట్లు జరగకుండా చూడాలని, నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏఏ ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా తెలిసేలా ప్రదర్శించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని, ఫ్రీ సింబల్స్ ను ప్రదర్శించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నగర పాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి, రిటర్నింగ్, అసిస్టెంట్, వార్డు అధికారులు ఉన్నారు.
Tags
mahabubnagar