వనపర్తికి వెళ్లి వస్తానన్న యువతి అదృశ్యం


 గోపాల్‌పేట : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంటి నుంచి వనపర్తికి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన యాప చెట్టు బాలమ్మ, చిన్న గట్టయ్య చిన్న కుమార్తె యాప చెట్టు నాగలక్ష్మి (24) సుమారు నాలుగు నెలల క్రితం వనపర్తికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే ఆమె తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు గ్రామంలో, బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా వెతికినా నాగలక్ష్మి ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం తల్లి యాపచెట్టు బాలమ్మ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow