రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి నీళ్ల బాటిల్లో తోటి విద్యార్థులు యూరిన్ పోశారు. ఈ ఘటన కొమురం భీం(Kumuram Bheem Asifabad) జిల్లా కాగజ్ నగర్లోని మహాత్మ జ్యోతి బాపులె హాస్టల్లో చోటుచేసుకుంది. హనీష్ అనే 7వ తరగతి విద్యార్థి బాటిల్లో తోటి విద్యార్థులు యూరిన్ పోశారు. ఆ నీళ్లు తాగడంతో హనీష్కి ఇన్ఫెక్షన్ అయింది. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి వాటర్ ప్రాబ్లం వల్లనే అని తేల్చారు. తల్లిండ్రులు విద్యార్థిని గట్టిగా అడ్డగా.. అసలు విషయం చెప్పారు. దీంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇందుకు కారకులైన తోటి స్టూడెంట్స్పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అక్కడున్న స్థానికులు కలవరపాటుకు గురిచేసింది. విషయం తెలిసి మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Tags
Telangana