Mahabubnagar News :PRO శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహబూబ్నగర్ జిల్లా PRO ఎస్.శ్రీనివాసులకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది"
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి IPS ప్రధాన అతిథిగా ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఎస్. శ్రీనివాసులు శిక్షణలో సఫలంగా పాల్గొని, రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి IPS చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి IPS
శ్రీనివాసులు గారిని అభినందిస్తూ, "ప్రజా సంబంధాల విభాగం పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం వంటిది. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను జిల్లాలోని పోలీస్ ప్రజా సంబంధాల పనిలో ఉపయోగించి మరింత చురుకుగా పనిచేయాలని" సూచించారు.
శ్రీనివాసులు గారిని అభినందిస్తూ, "ప్రజా సంబంధాల విభాగం పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం వంటిది. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను జిల్లాలోని పోలీస్ ప్రజా సంబంధాల పనిలో ఉపయోగించి మరింత చురుకుగా పనిచేయాలని" సూచించారు.
ఈ కార్యక్రమంలో IGP (P&L) రమేష్ రెడ్డి IPS, DCP (CAR) రక్షిత మూర్తి IPS , శిక్షణా సమన్వయకర్తమధుసూదన్ , మరియు తెలంగాణ సురక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.
Tags
mahabubnagar