*
*ఢిల్లీ ఘటన నేపథ్యంలో షాద్ నగర్ లో నాకబంది*
*వాహనాలను ప్రత్యేక తనిఖీ చేసిన పోలీసులు*
*షాద్ నగర్ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు*
*బస్ స్టేషన్, లాడ్జింగ్ లు, తదితర పబ్లిక్ ప్రదేశాలలో విస్తృత తనిఖీలు*
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో హైదరాబాద్ తోపాటు పలు జంట నగరాలు, శివారు పోలీస్ స్టేషన్లను రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన హైదరాబాద్ కు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే లతోపాటు పలు ముఖ్యమైన రహదారులలో పోలీసులు నాకాబంది నిర్వహిస్తున్నారు. షాద్ నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు వాహనాల తనిఖీలను ప్రత్యేకంగా చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తోపాటు మరికొంతమంది ఎస్ఐలు, పోలీసు సిబ్బంది వాహనాల ఈ తనిఖీలు చేపట్టారు. బస్ స్టేషన్, లాడ్జింగ్ లు, తదితర పబ్లిక్ ప్రదేశాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
పోలీసులు అప్రమత్తం కావడంతో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నేపద్యంలో అనుమానాస్పద వ్యక్తులు సంచర
