Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్… సగానికి తగ్గనున్న బంగారం, వెండి ధర.. నిపుణులు చెప్పేది తెలిస్తే..
బంగారం, వెండిలో రికార్డు స్థాయిలో లాభాలు త్వరలోనే తొలగిపోతాయని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. రెండు విలువైన లోహాలు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. కానీ, అతి త్వరలోనే తిరగబడబోతున్నాయని అంటున్నారు. కేవలం గాలిలోకి బాణాలు వేయడం మాత్రమే కాదు. బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతాయో బలమైన కూడా కారణం చెబుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ప్రస్తుతం చారిత్రాత్మక గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అక్టోబర్ 8వ తేదీ బుధవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు రూ.1,23,930లకు చేరింది. ఇక వెండి ధర కిలోకు రూ.1,60,000లు పలుకుతోంది. ప్రపంచ బంగారు మండలి ప్రకారం 2025లో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర 47 శాతం పెరిగింది. చాలా మంది మార్కెట్ విశ్లేషకులు ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందని విశ్వసిస్తున్నారు. అయితే, బులియన్ మార్కెట్ విశ్లేషకులు అమిత్ గోయల్ దీనిని అంగీకరించలేము అంటున్నారు. బంగారం, వెండిలో రికార్డు స్థాయిలో లాభాలు త్వరలోనే తొలగిపోతాయని అమిత్ గోయల్ అంటున్నారు. రెండు విలువైన లోహాలు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. కానీ, అతి త్వరలోనే తిరగబడబోతున్నాయని అంటున్నారు. అమిత్ గోయల్ కేవలం గాలిలోకి బాణాలు వేయడం మాత్రమే కాదు. బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతాయో బలమైన కారణం కూడా చెబుతున్నారు. రెండు విలువైన లోహాల ధరలు దశాబ్దాలలో అత్యంత ప్రమాదకరమైన శిఖరాలకు చేరుకున్నాయని చెప్పుకొచ్చారు గోయల్. గత నలభై సంవత్సరాలలో డాలర్ ఇండెక్స్ బలహీనపడినప్పుడు బంగారం, వెండి ధరలు రెండుసార్లు మాత్రమే బాగా పెరిగాయని చెప్పారు. అయితే, రెండు సార్లు పదునైన పెరుగుదల తర్వాత బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయని చెప్పారు.
రాబోయే రోజులు లేదా వారాల్లో రెండు లోహాలు నిరోధక స్థాయిలను చేరుకుంటాయని, ఇది పదునైన అమ్మకాలకు దారితీయవచ్చని గోయల్ చెప్పారు. దీంతో బంగారం ధరలు 30 నుంచి 35శాతం తగ్గి, 10 గ్రాములకు రూ. 77,701కి చేరుకోవచ్చు అంటున్నారు. వెండి ధరలు మరింత తగ్గుతాయని గోయల్ అంచనా వేస్తున్నారు. కిలో వెండి ధర రూ.77,450 కి చేరుకోవచ్చని, ఇది ప్రస్తుత ధరలో సగం అని అన్నారు.
Tags
india