Heavy Rainfall: జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా.

 వర్షాకాలం మొదలైనా కూడా పలు ప్రాంతాల్లో మాత్రం వానలు (Heavy Rainfall) సరిగా కురవడం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే రెండు రోజుల్లో హర్యానా, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.




దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు (Heavy Rainfall) కురుస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో నేటితోపాటు రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇదే వాతావరణం తెలంగాణలో కూడా కొనసాగనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఇవాళ, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పంజాబ్, హర్యానాలో వర్షాలు

మరోవైపు జూన్ 25 నుంచి 30 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం ఈ రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. చండీగఢ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 34.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. పంజాబ్‌లో అమృత్‌సర్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, లూధియానాలో 33.5, పటియాలాలో 33.1, పఠాన్‌కోట్‌లో 34.1, మరియు మొహాలీలో 33.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హర్యానాలో అంబాలాలో 33.4 డిగ్రీల సెల్సియస్, హిసార్‌లో 36.7, కర్నాల్‌లో 30.2, నర్నాల్‌లో 35.4, గురుగ్రామ్‌లో 36 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది.

ఈ ప్రాంతాల్లో కూడా..

మంగళవారం రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జైపూర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని తూర్పు ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, బికనీర్ డివిజన్లలో రాబోయే రోజుల్లో ఉరుములు, వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ముందస్తు జాగ్రత్తలు

జూన్ 26 నుంచి 29 వరకు ఈ డివిజన్లలో వర్షపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసే ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి, వరదలు ఉరుముల నుంచి రక్షణ పొందేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.


Previous Post Next Post

نموذج الاتصال