Raj Bhavan Theft Case: తెలంగాణ రాజ్భవన్లో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. రాజ్భవన్లోని సుధర్మ భవన్లో 4 హార్డ్డిస్క్లు మాయమయ్యాయి. హెల్మెట్తో ఓ వ్యక్తి రాజ్భవన్లోకి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు రాజ్భవన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈనెల 14వ తేదీన రాత్రి చోరీ జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చారు. కీలక ఫైల్స్ చోరీ అయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ రాజ్భవన్లో జరిగిన చోరీ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్భవన్ వంటి అత్యంత భద్రతా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై సందేహాలను కలిగిస్తోంది. రాజ్భవన్లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఈ హార్డ్డిస్క్ల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డేటా మాయం కావడం వల్ల ప్రభుత్వ రహాస్యాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tags
Telagana