Group 1 Results: కాపేపట్లో గ్రూప్‌-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ


 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్‌-1 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. 

హైదరాబాద్‌: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్‌-1 (Group-1) ఫలితాలు (Results) సోమవారం విడుదల కానున్నాయి. 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల (Preliminary Marks) వివరాలు ఈరోజు టీజీపీఎస్సీ (TGPSC) వెల్లడించనుంది. అలాగే మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్... 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

కాగా గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్‌-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ తెలిపింది.

కాగా గ్రూప్-1పై నెల రోజుల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి పలువురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.

కాగా, తెలంగాణలో గ్రూపు-1 మెయిన్‌ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ జరిగిన సంగతి తెలిసిందే. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,403 (క్రీడల కోటా కలిసి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. రాజకీయ పార్టీలు సైతం వారికి మద్దతు తెలపడంతో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో లాఠీ ఛార్జ్ సైతం జరిగింది. పెద్దఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలు మెుదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me