ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవం : నాగర్​కర్నూల్ కలెక్టర్‌ - SLBC TUNNEL RESCUE OPERATION



ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో పురోగతి - గల్లంతైనవారి పరిస్థితిపై కాసేపట్లో వెలువడనున్న అధికారిక సమాచారం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధికారులు పలు విధాలా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్‌ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది అనుకుంటున్నారు.

మరోవైపు, ఆ మెత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు, కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. మెత్తని భాగాలు ఉన్న చోట తవ్వకాలు అధికారులు జరపనున్నారు. తవ్విన తరువాత మానవ దేహాలా కాదా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ ఘటనలో గల్లంతైన వారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైనా సమాచారం ఉంటే మేము వెల్లడిస్తాం : ఎస్​ఎల్​బీసీ టన్నెల్‌లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవన్న నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్‌ సంతోష్‌ తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఏదైనా సమాచారం ఉంటే తాము వెల్లడిస్తామని అన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me