జడ్చర్లలో ఒక వ్యక్తికి వచ్చిన వెబ్ లింకు నీ ఓపెన్ చేసి 27,99 రూపాయలు పోగొట్టుకున్న వైనం.
తస్మాత్ జాగ్రత్త..
ఫోన్కు వచ్చిన లింక్ను ఓపెన్ చేయగా తన ఖాతాలో నుంచి డబ్బులు పోయాయని బాధితుడు సోమవారం జడ్చర్ల PSలో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI ఆదిరెడ్డి తెలిపారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అనిల్ కుమార్ బిస్వాల్ ఫోన్కు ఈనెల 4న ఓ లింక్ రాగా దాన్ని ఓపెన్ చేస్తే అకౌంట్లో నుంచి రూ.27,999 డ్రా అయినట్లు ఓటీపీ వచ్చింది. దీంతో సైబర్ క్రైంకు ఫోన్ చేయడంతో లావాదేవిలు నిలిపివేశారు.
Tags
News@jcl
