గురువెక్కడో.. మేమూ అక్కడే ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు

 


ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. అయితే, బదిలీపై వెళ్లిన ఓ ఉపాధ్యాయుడితోపాటే పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసు కుంది. జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశా లలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జులై 13న చేరారు. అప్పుడు అక్కడ ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 32 మంది విద్యార్థులు ఉండే వారు. ఆయన పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో పాఠాలు బోధించడం, ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా 250కి చేరింది. ఆయన ఈ నెల 1న ఇదే మండలంలో

మూడు కి.మీ. దూరంలోని అక్కపె ల్లిగూడ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ పరిణామాన్ని విద్యార్థులు తట్టుకో లేకపోయారు. తమ కెంతో ఇష్టమైన లలోనే చేరతా మంటూ పిల్లలు గొడవ చేయడంతో 2, 3 తేదీల్లో ఏకంగా 133 మందిని వారి తల్లిదండ్రులు అక్క పెళ్లిగూడ బడిలో చేర్చించారు. దాంతో జూన్ 30న కేవలం 21 మంది విద్యార్థులున్న అక్క పెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మందితో కళకళ లాడుతోంది. ఈ పాఠశాలలో జాజాల శ్రీనివాస్ పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. - న్యూస్టుడే, జన్నారం


అక్క పెల్లిగూడలో పాఠాలు బోధిస్తున్న మాస్టారున్న పాఠశా ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me