గోవులను అక్రమంగా తరలిస్తే చర్యలు
సీఐ నాగార్జున గౌడ్ బాలానగర్ లో 20 వాహనాల్లో ఆవులు, దూడెలు పట్టుకున్న పోలీసులు
గోవులను అక్రమంగా రవాణా
చేసినా, వధించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. బాలానగర్ మండల కేంద్రంలో చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టగా పెబ్బేరు నుంచి హైదరాబాద్ కు సుమారుగా 20 వాహనాల్లో ఆవులు, దూడెలు తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలి పారు. పశువులను తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
ధ్రువపత్రాలు ఉన్న కొన్ని వాహనాలను పంపించారు. మూడు వాహనాల్లో తరలి స్తున్న ఆవు దూడెలు, దూడెలుకు సంబంధించి పత్రాలు లేక పోవడంతో సీజ్ చేసి, జడ్చర్ల సమీపంలోని గోశాలకు తరలిం చినట్లు సీఐ చెప్పారు.
వీహెచ్పీ, భాజపా నాయకులు రాణాకు చేరుకొని గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వారితో ఎంఐఎం నాయకులు వాగ్వాదానికి దిగగా ఎస్సై తిరు పాజీ చెదరగొట్టారు.
పరిస్థితిని తెలుసుకున్న జిల్లా అదనపు ఎస్పీ రాములు, సీఐ లు ఆదిరెడ్డి, గాంధీనాయక్, బెటాలియన్, పోలీస్ సిబ్బంది ఠాణాను పరిశీలించారు. జాతీయ రహదారిపై తనిఖీ నిర్వహిస్తున్నారు.