న్యూఢిల్లీ:
బిజెపిలో చేరిన నాగర్ కర్నూల్ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు రాములు, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్, లోక్నాథ్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి
🔹ఈరోజు న్యూఢిల్లీ బిజెపి జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్,జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ తరుణ్ చుగ్ , డాక్టర్ కె లక్ష్మణ్ గారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరియు డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు ల సమక్షంలో బీజేపీ లోకి చేరిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు గారు మరియు కల్వకుర్తి జడ్పిటిసి పోతుగంటి భరత్ ప్రసాద్ గారు మరియు వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి గారు మరియు డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గార్లను బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ:
🔹బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది.
🔹దేశానికి సేవ చేయాలని భరత్ ప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.
🔹యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.
🔹నా నియోజకవర్గ అభివృద్ధి చెందలన్న ఉద్దేశంతో,ఎస్సి వర్గీకరణ కోసం,దళిత వర్గాలకు న్యాయం చేకూరుతుందని బీజేపీలో చేరా.
🔹ఏ పార్టీలో ఉన్నా ప్రజా సేవ,అభివృద్ధి నాకు ముఖ్యం.
🔹మోడీ నాయకత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరా
ఎవరిని విమర్శించడానికి కాదు
🔹మోడీ నాయకత్వ పాలనను గ్రామ గ్రామానికి తీసుకెళ్తా
🔹తక్కువ మాట్లాడుతా..ఎక్కువ పనిచేస్తా.
బీజేపీ కోసం పనిచేస్తా:
🔹బాగా పనిచేస్తా అని మోడీతో చెప్పించుకునేలా పని చేస్తా
లక్ష్మణ్:
🔹నాగర్ కర్నూల్ ఎంపి రాములు మచ్చ లేని నాయకులు
🔹తెలంగాణలో మోడీ మయం కానుంది
🔹మూడవ సారి మోడీ నీ ప్రధాని చేయాలనుకుంటున్నారు
🔹BRS మునిగిపోయిన పడవ
🔹బిజెపి తెలంగాణ లో తిరుగులేని శక్తిగా మారుతుంది
🔹గత పదేళ్ళలో తెలంగాణకు కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది
🔹పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తెలంగాణ లో ముందుకుపోతుంది
తరుణ్ చుగ్
తెలంగాణ బీజేపీ ఇంచార్జి:
ప్రతిరోజు దేశంలో ఎదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసేవారు బీజేపీలో చేరుతున్నారు
ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదలకు వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారు
పేదలకు ఇళ్ళు,గ్యాస్,నీళ్లు,మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు
దేశ ఖ్యాతి ,వికసిత భారత్ లక్ష్యాన్ని,పేదరిక నిర్ములన కోసం మోడీ చేస్తున్న పని చూసి బీజేపీలో చేరుతున్న అని రాములు చెప్పారు.
