పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[1] జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.[2] +
విషయాలు 1 ప్రాజెక్టు వివరాలు 2 పర్యావరణ అనుమతులు 3 జలాశయాలు, వాటి సామర్థ్యాలు 4 ప్రయోజనం పొందే ప్రాంతాలు 4.1 తాగునీరు, పరిశ్రమలు 4.2 సాగునీరు 5 మూలాలు ప్రాజెక్టు వివరాలు హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం. సముద్ర మట్టం నుండి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు. రూ. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10 న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.[3] ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో - మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు. పర్యావరణ అనుమతులు ఈ పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంపాటు ప్రయత్నాలు చేసింది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాల కారణంగా అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించిన ఈఏసీ, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అప్పుడు ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను తెలియపరుస్తూ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.[4] 2023, జూన్‌ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. 2023, జూన్ 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలు వినిపించడంతోపాటు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. అందులో రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల పర్యావరణానికి 153.69 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు, అందుకు నష్ట నివారణ ప్రణాళికతోపాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికల వివరాలును ప్రభుత్వం తెలిపింది.[5] ఆ నివేదికతో ఏకీభవించిన ఈఏసీ, 153.70 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతోపాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని షరతులు విధిస్తూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు 2023, ఆగస్టు 10న విడుదల చేసిన 49వ ఈఏసీ మినట్స్ లో వెల్లడించింది.[6] జలాశయాలు, వాటి సామర్థ్యాలు గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ జలాశయాలను నిర్మించింది. ఆయా జలాశమాలకు స్థానికంగా గుట్టలపై కొలువైన దేవుళ్ళ పేర్లు పెట్టబడ్డాయి.[7] ప్రాజెక్టులో భాగంగా నిర్మించే జలాశయాల వివరాలు ఇలా ఉన్నాయి:[8] క్ర.సం. జలాశయం పేరు స్థలం కట్ట పొడవు (కి.మీ.) పూర్తి స్థాయి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యం (టిఎమ్‌సి) వాడుకోగలిగే నీరు (టిఎమ్‌సి) ఆయకట్టు (ఎకరాల్లో) 1 అంజనగిరి జలాశయం నార్లాపూర్ 6.647 +345.000 మీ. 8.51 7.95 0 2 వీరాంజనేయ జలాశయం ఏదుల 7.716 +445.000 మీ. 6.55 5.91 0 3 వెంకటాద్రి జలాశయం వట్టెం 14.75 +542.000 మీ. 16.74 14.47 1,39,000 4 కురుమూర్తిరాయ జలాశయం కరివెన 13.185 +531.000 మీ. 17.34 16.9 1,90,000 5 ఉద్దండాపూర్ జలాశయం ఉద్దండాపూర్ 15.875 +629.000 మీ. 16.03 15.61 4,88,000 6 లక్ష్మీదేవిపల్లి జలాశయం రంగారెడ్డి జిల్లా, లక్ష్మీదేవిపల్లి 6.05 +670.000 మీ. 2.8 2.5 4,13,000 మొత్తం 64.223 67.97 63.34 12,30,000 ప్రయోజనం పొందే ప్రాంతాలు తాగునీరు, పరిశ్రమలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన జంటనగరాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పరిశ్రమలకు నీరు అందిస్తారు. సాగునీరు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక ప్రాజెక్టు రెండవ దశలో ఉంది. మండలాల వారీగా ఆయకట్టు ఇలా ఉంటుంది:[8] జిల్లా నియోజకవర్గం మండలం ఆయకట్టు (ఎకరాల్లో) మహబూబ్‌నగర్ దేవరకద్ర అడ్డకల్ 18,692 భూత్‌పూర్ 13,105 మూసాపేట్ 6,000 దేవరకద్ర 20,655 నియోజక వర్గంలో మొత్తం భూమి 58,452 జడ్చర్ల బాలానగర్ 30,311 రాజాపూర్ 10,000 జడ్చర్ల 38,585 మిడ్జిల్ 32,097 నవాబ్‌పేట 25,576 నియోజక వర్గంలో మొత్తం భూమి 1,36,569 మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ (గ్రామీణ) 9,692 హన్వాడ 12,527 నియోజక వర్గంలో మొత్తం భూమి 22,219 మక్తల్ మాగనూరు 264 మక్తల్ 17,549 నర్వ 5,918 ఊటుకూరు 34,281 నియోజక వర్గంలో మొత్తం భూమి 58,012 నారాయణపేట దామరగిద్ద 1,207 ధన్వాడ 15,734 కోయిలకొండ 25,794 నారాయణపేట 16,056 నియోజక వర్గంలో మొత్తం భూమి 58,791 *పర్గి గండీడ్ 24,414 నియోజక వర్గంలో మొత్తం భూమి 24,414 *KODANGAL కోస్గి 26,023 మద్దూరు 28,687 నియోజక వర్గంలో మొత్తం భూమి 54,710 మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం భూమి 4,13,167 వికారాబాదు *పరిగి దోమ 20,473 కుల్కచర్ల 10,412 పూదూరు 11,750 పర్గి 18,587 నియోజక వర్గంలో మొత్తం భూమి 61,222 తాండూరు బషీరాబాద్ 26,982 పెద్దేముల్ 19,958 తాండూరు 29,040 యాలాల 22,112 నియోజక వర్గంలో మొత్తం భూమి 98,092 వికారాబాదు కోటేపల్లి 11,622 బంట్వారం 5,985 ధరూర్ 21,357 మర్పల్లి 28,049 మోమిన్‌పేట్ 18,753 వికారాబాద్ 9,286 నియోజక వర్గంలో మొత్తం భూమి 95,052 *కోడంగల్ బొం‌రాస్‌పేట 29,063 కోడంగల్ 18,003 దౌలతాబాద్ 8,667 నియోజక వర్గంలో మొత్తం భూమి 55,733 చేవెళ్ళ నవాబ్‌పేట 12,276 నియోజక వర్గంలో మొత్తం భూమి 12,276 వికారాబాదు జిల్లాలో మొత్తం భూమి 3,22,375 నాగర్‌కర్నూలు అచ్చంపేట వంగూరు 1,357 చారకొండ 1,000 నియోజక వర్గంలో మొత్తం భూమి 2,357 నగర్‌కర్నూల్ బిజినపల్లి 7,712 తిమ్మాజీపేట 23,263 తాడూరు 4,082 నియోజక వర్గంలో మొత్తం భూమి 35,057 *కల్వకుర్తి ఊరుకొండ 4,482 కల్వకుర్తి 18,957 వెల్దండ 39,705 నియోజక వర్గంలో మొత్తం భూమి 63,144 నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం భూమి 1,00,558 రంగారెడ్డి *కల్వకుర్తి ఆమనగల్లు 11,261 కడ్తాల్ 4,922 మాడ్గుల్ 30,609 తలకొండపల్లి 24,104 నియోజక వర్గంలో మొత్తం భూమి 70,896 చేవెళ్ళ చేవెళ్ళ 24,028 షాబాద్ 25,369 మొయినాబాద్ 28,535 శంకరపల్లి 19,331 నియోజక వర్గంలో మొత్తం భూమి 97,263 షాద్‌నగర్ ఫరూక్‌నగర్ 21,345 కొందుర్గ్ 18,395 చౌదర్‌గూడెం 13,500 కొత్తూరు 18,852 నందిగామ 10,000 కేశంపేట 1,969 నియోజక వర్గంలో మొత్తం భూమి 84,061 ఇబ్రహీంపట్నం మంచాల 15,621 యాచారం 28,612 ఇబ్రహీంపట్నం 29,185 హయత్‌నగర్ 12,496 నియోజక వర్గంలో మొత్తం భూమి 85,914 రాజేంద్రనగర్ శంషాబాద్ 6,601 నియోజక వర్గంలో మొత్తం భూమి 6,601 మహేశ్వరం మహేశ్వరం 8,251 కందుకూరు 10,914 నియోజక వర్గంలో మొత్తం భూమి 19,165 రంగారెడ్డి జిల్లాలో మొత్తం భూమి 3,63,900 నల్గొండ దేవరకొండ చింతపల్లి 10,454 చందంపేట 75 గుండ్లపల్లె 3,682 దేవరకొండ 11,773 నియోజక వర్గంలో మొత్తం భూమి 25,984 మునుగోడు మర్రిగూడ 4,016 నియోజక వర్గంలో మొత్తం భూమి 4,016 నల్గొండ జిల్లాలో మొత్తం భూమి 30,000 ప్రాజెక్టు మొత్తం 12,30,000
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me