జడ్చర్లకు రెవెన్యూ డివిజన్ హోదా కావాలి!



👉 జడ్చర్లను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.

📌 ముఖ్య డిమాండ్లు:

✅ రాజాపూర్, ఊర్కొండ మండలాలలో తాసిల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు

✅ జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నూతన భవనం

✅ కావేరమ్మపేటలో మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం 2000 గజాల స్థలం కేటాయింపు

🏛️ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటికి వినతిపత్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, “జడ్చర్లకు అన్ని అర్హతలు ఉన్నాయి… ప్రజల చిరకాల కోరిక ఇదే” అని తెలిపారు.

🤝 ఈ అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow