వనపర్తికి చెందిన ఆర్. పాండును నాగర్‌కర్నూల్ డీఆర్వోగా బదిలీ

 

హైదరాబాద్, మే 27: రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు జరిగాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.

  • నిర్మల్‌కి చెందిన ఏ. మోతీరాంను మంచిర్యాల డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.

  • కరీంనగర్‌కి చెందిన బి. రాజేశ్వరికి పెద్దపల్లి డీఆర్వో బాధ్యతలు అప్పగించారు.

  • పెద్దపల్లికి చెందిన కె.వై.ప్రసాద్‌ను జగిత్యాల డీఆర్వోగా నియమించారు.

    • ఖమ్మంకి చెందిన వి. రవి కుమార్‌ను ములుగు డీఆర్వో‌గా పోస్టింగ్ ఇచ్చారు.

    • మేడ్చల్-మల్కాజిగిరి జె.స్వామికి కరీంనగర్ డీఆర్వోగా బాధ్యతలు అప్పగించారు.


    • నాగర్‌కర్నూల్‌కి చెందిన ఎ. పాండుకు కామారెడ్డి డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.

    • జనగాంకి చెందిన సీహెచ్ శ్రీకాంత్‌కు మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏగా నియామించారు.

    • సూర్యాపేటకి చెందిన ఎం. సుదర్శన్ రెడ్డికి సిద్ధిపేట ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా బాధ్యతలు అప్పగించారు.


    • ఖమ్మం ఎం. రామదేవికి నల్గొండ ఎస్‌డీసీ(ఎల్‌ఏ) పోస్టింగ్

    • పెద్దపల్లి జి. కుమారస్వామికి సిరిసిల్ల ఎస్‌డీసీ(ఎల్‌ఏ) బాధ్యతలు

    • కరీంనగర్ ఎన్. వెంకట్ రెడ్డికి కరీంనగర్ ఎస్‌డీసీ(ఎల్‌ఏ)గా నియామకం

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow