*పెండిగు బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రికి మాజీ సర్పంచులు పోస్టు కార్డు ద్వారా వినతి*
*రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్*
తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశంలోనే తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు.శుక్రవారం రాష్ట్ర స్థాయి పోస్టు కార్డు ఉద్యమాన్ని మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల మండల కేంద్రంలో పోస్టాఫీసు దగ్గర సర్పంచులతో కలిసి ముఖ్యమంత్రికి పెండిగు బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డులు పంపారు.అనేక నిరసనలు,ఉద్యమాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్పంచులను పట్టించుకోక ఆర్థికంగా కుదేలు చేసిందని ద్వెజమెత్తారు..ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సర్పంచుల పెండింగు బిల్లులు చెల్లించాలని *సర్పంచుల పోస్టుకార్డు ఉద్యమం* నకు రాష్ట్ర కార్యవర్గం శ్రీకారం చుట్టిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసు వారిచే అణిచివేయడం తగదని అన్నారు.అక్రమ అరెస్టులకు నిరసనగా పోస్టు కార్డు ద్వారా సర్పంచుల యొక్క గోస ముఖ్యమంత్రి గారికి తెలియజేయడమే లక్ష్యంగా సర్పంచులందరూ పాల్గొన్నట్లు తెలిపారు. అందాల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగు బిల్లులు ఎందుకు విడుదల చేయడంలేదు అని అడిగారు.హంగులు,ఆర్భాటాలకు, ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని,ఆదర్శవంతంగా గ్రామాలను తీర్చిదిద్దిన సర్పంచులను అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి తెలంగాణ సర్పంచుల పెండింగు బిల్లులు వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపుణిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల మండల సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మండల కార్యదర్శి రవీందర్ రెడ్డి, షంషీర్, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.