Andhra Pradesh: అద్భుతం.. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..
ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి.. 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతోంది ఆ సంస్థ. ఇంతకు ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉన్నది? ప్రత్యేకతలు ఏంటి..? ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..
ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి.. 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. ఇంతకు ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏంటి..? ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉంది? పూర్తి వివరాలను తెలుసుకోండి.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం పరిధిలో గ్రీన్ కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.. ఇప్పటికే దీని పనులు 80% పైగా పూర్తయ్యాయి. పలు దేశాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టుకు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటంటే… సౌర, పవన, హైడల్.. విద్యుత్ ఒకే చోట జరుగుతుండటం. మరో విశేషం ఏంటంటే.. విద్యుత్ ఉత్పత్తికి వాడే నీటిని రీసైకిల్ చేయడం. ఎగువ నుంచి నీటిని దిగువకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదే నీటిని వెనక్కి రప్పిస్తూ మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేయడం… దీని స్పెషాలిటీ. సూర్య రష్మి ఉన్నంతవరకు సౌర విద్యుత్, పవన్ విద్యుత్, రాత్రి వేళల్లో హైడల్ పవర్ ప్రొడక్షన్. ఇలా మూడు రకాల విద్యుత్ ప్రత్తిని ఒకే చోట చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.